కేరళను వణికిస్తున్న నిఫా - మరో ఇద్దరు హెల్త్ వర్కర్లలో లక్షణాలు

ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (16:49 IST)
నిఫా వైరస్ కేరళ రాష్ట్రాన్ని వణికిస్తుంది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్‌ బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా మరో ఇద్దరిలో లక్షణాలు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్‌ ఆదివారం వెల్లడించారు. మరణించిన 12 ఏళ్ల బాలుడికి దగ్గరగా ఉన్న 20 మంది హైరిస్ట్‌ కాంటాక్టుల్లో ఇద్దరూ ఉన్నారని తెలిపారు. 
 
ఈ అంశంపై ఆమె స్పందిస్తూ, 'మేమం ఇప్పటివరకు 188 కాంటాక్ట్‌లను గుర్తించాం. నిఘా బృందం వారిలో 20 మందిని హై రిస్క్‌ కాంటాక్టులుగా గుర్తించింది. ఇద్దరిలో లక్షణాలున్నాయి. వీరిద్దరూ ఆరోగ్య కార్యకర్తలు. ఒకరు ప్రైవేటు హాస్పిటల్‌లో పని చేస్తున్నారు. మరొకరు కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీ స్టాఫ్‌ మెంబర్‌' అని వివరించారు. 
 
నిఫా వైరస్‌ పరిస్థితిపై ఆమె ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. సాయంత్రం వరకు 20 హై రిస్క్‌ కాంటాక్టులను కోజికోడ్‌ మెడికల్‌ కాలేజీకి బదిలీ చేయనున్నట్లు చెప్పారు. పిల్లలు, ఇతర కాంటాక్టులు క్వారంటైన్‌లో ఉండాలని కోరినట్లు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు