దేశంలో కొత్తగా 46 వేల కేసులో.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34 శాతం

బుధవారం, 30 జూన్ 2021 (10:01 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరోమారు పెరిగింది. కిందటి రోజుతో పోల్చితే ఈ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 45,951 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
 
తాజాగా 60,729 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ ప్రభావంతో మరో 817 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,03,62,848కు పెరిగింది. వైరస్‌ నుంచి మొత్తం 2,94,27,330 బాధితులు కోలుకున్నారు. 
 
ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 3,98,454 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసులు 5,37,064కు చేరాయి. మరో వైపు టీకా డ్రైవ్‌ ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు 33,28,54,527 డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది. 
 
ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగిందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతంగా ఉందని, ఇప్పటివరకు 41.01 కోట్ల కొవిడ్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు