ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: అది జరిగితే అగ్రస్థానానికి పాకిస్థాన్..?

శనివారం, 26 ఆగస్టు 2023 (17:46 IST)
ఆఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌ జట్లు మూడు వన్డేల సిరీస్‌ ఆడుతున్నాయి. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. అనంతరం జరిగిన 2వ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో పాక్ జట్టు 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంలో ఇరు జట్ల మధ్య 3వ, చివరి వన్డే నేడు జరగనుంది.
 
ఈ మ్యాచ్‌లోనూ పాక్‌ విజయం సాధిస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, పాకిస్థాన్ 2వ స్థానంలో ఉన్నాయి. ఇరు జట్లకు 118 పాయింట్లు ఉన్నాయి. భారత్ 113 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు