భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. టెస్ట్ కెరీర్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్టు ప్రకటించారు. ఎవరూ ఊహించని విధంగా కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక ఉన్న కారణాలు ఇపుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు మీడియాలో పలు రకాలైన వార్తా కథనాలు మీడియాలో వస్తున్నాయి.
మీడియా కథనాల మేరకు.. కోహ్లీకి మరోమారు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ సమయంలో ప్రతిపాదనలు వచ్చినట్టు సమాచారం. ఆ సిరీస్లో టీం ఇండియా 3-1 తేడాతో ఓడిపోయింది. దీంతో కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ యూటర్న్ తీసుకుంది. యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ప్రక్రియను ప్రారంభించినట్టు ఆ కథనాల్లో పేర్కొన్నారు.
మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారన్న ఆశతోనే కోహ్లీ ఢిల్లీ తరపున రంజీ మ్యాచ్ ఆడాడని చెబుతున్నారు. ఆడిలైడ్ టెస్ట్ తర్వాత కెప్టెన్సీ విషయంలో అతడికి హింట్ ఇచ్చారని, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయని అతడి సన్నిహితులు చెప్పినట్టు ఆయా కథనాల్లో రాసుకొచ్చారు.