టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిని చేస్తే.. రాష్ట్రంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటున్నారో తెలిపారు. తాను ఒకరోజు పంజాబ్ ముఖ్యమంత్రి అయితే.. పిల్లల విద్యను మెరుగుపరచడం తన మొదటి దృష్టి అని అన్నారు. దీని తరువాత రాష్ట్రంలో ఎవరూ ఆకలితో నిద్రపోకూడదని, ప్రతి ఒక్కరికి రోజుకు మూడు పూటల భోజనం లభించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు.
రాజకీయాల్లో చేరడం గురించి హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, అలాంటి పరిస్థితులు తలెత్తితే పంజాబ్కు తన అవసరం అనిపిస్తే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను వెనుకాడనన్నారు. యువత ముందుకు వచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని తాను నమ్ముతున్నానని తెలిపారు. తన హృదయం ఎప్పుడూ భారత జట్టుతోనే ఉంటుందని, అందుకే తాను భారత జట్టుకు కోచ్గా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.