వెస్టిండీస్తో అక్టోబర్ 2 నుంచి జరగనున్నరెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్క్వాడ్ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ జట్టులో కొన్ని కీలకమైన మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఆసియా కప్ ఫైనల్కు చేరుకున్న భారత జట్టు, ఆ టోర్నమెంట్ ముగిసిన వెంటనే వెస్టిండీస్లో పర్యటించనుంది.
పడిక్కల్ ఇటీవలి దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడం విశేషం. స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా ఇప్పటికే జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ జట్టులో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
జట్టు వివరాలు
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్,కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్.