విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల లగ్జరీ ఫ్లాట్.. నెట్టింట ఫోటోలు వైరల్

సెల్వి

బుధవారం, 2 అక్టోబరు 2024 (18:41 IST)
Anushka
స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలను తరచుగా 'విరుష్క' అని పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ జంటలలో వీరు ఒకరు. డిసెంబర్ 2017లో వీరి వివాహం జరిగింది. వీరికి వామిక, అకాయ్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
 
ప్రస్తుతం ముంబైలోని 34 కోట్ల రూపాయల విలువైన అద్భుతమైన ఇంటిలో నివసిస్తున్నారు. వారి విలాసవంతమైన నివాసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
ముంబైలోని వర్లీలో ఉన్న ఓంకార్ 1973లో ఒక లగ్జరీ కాంప్లెక్స్‌లో అందమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు విరాట్. ఇది ఈ 7,171 చదరపు అడుగులతో కూడిన ఈ అపార్ట్‌మెంట్ టవర్ సిలో ఉంది. ఇది కాంప్లెక్స్‌లోని మూడింటిలో అత్యంత విలాసవంతమైన ఫ్లాట్.. ఈ ఫ్లాట్.. సీ వ్యూకు బెస్ట్‌గా వుంది. 
Vamika
 
70 అంతస్తుల ఎత్తులో ఉన్న మూడు టవర్లతో ఈ భవనం ఆకట్టుకుంటుంది. అపార్ట్‌మెంట్‌లో ఇండోర్ జిమ్ కూడా ఉంది. ఇది ఫిట్‌నెస్‌ను ఇష్టపడే ఈ జంటకు తప్పనిసరి. రిలాక్స్‌డ్ లైఫ్‌స్టైల్‌కు అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు, ఫీచర్లతో ఈ అపార్ట్‌మెంట్ అమర్చబడి ఉంటుంది. విరాట్, అనుష్క తమ కెరీర్‌లో నిరంతరం బిజీగా ఉన్నప్పటికీ, వారు ఇంట్లో సాధారణ వస్తువులను ఆస్వాదించడానికి సమయాన్ని వెచ్చిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు