యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ.. రూ.70వేల నగదు, నగలు చోరీ

సెల్వి

శనివారం, 17 ఫిబ్రవరి 2024 (17:31 IST)
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంట్లో జనవరి 16 శుక్రవారం చోరీ జరిగింది. పంచకులలోని మానసా దేవి కాంప్లెక్స్‌లోని తమ ఇంట్లో నగదు, నగలు మాయమైనట్లు యువరాజ్ తల్లి షబ్మాన్ సింగ్ నివేదించారు.
 
తమ ఇంట్లో దొంగతనం జరగడంతో మాజీ ఆల్ రౌండర్ తల్లి పంచకుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంచకుల ఇంటి నుంచి 70వేల విలువైన నగదు, నగలు చోరీకి గురయ్యాయని, ఇద్దరు సిబ్బంది దొంగతనం చేశారని షబ్మాన్ సింగ్ తన ఫిర్యాదులో వెల్లడించారు. 
 
యువరాజ్ సింగ్ తల్లి ఫిర్యాదు మేరకు ఇద్దరు సిబ్బంది ఇంటి నుంచి వెళ్లిన ఆరు నెలలకే దొంగతనం జరిగింది. మాజీ ఆల్ రౌండర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లి ఇంట్లో చోరీ జరిగింది. గురుగ్రామ్‌లో ఉంటున్న సమయంలో నిందితుల సంరక్షణలో పంచకులలోని ఇంటిని విడిచిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు