భార్యతో గొడవపడి ప్రియురాలి ఇంటికి వెళ్లి భర్త ఆత్మహత్య!!

ఠాగూర్

గురువారం, 14 మార్చి 2024 (11:54 IST)
భార్యతో గొడవపడిన ఓ భర్త... తన ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. అయితే, తన భర్త మృతిపై భార్య అనుమానం వ్యక్తం చేస్తుంది. దీనిపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాఘవాపురంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాఘవాపురం గ్రామానికి చెందిన రక్తనిస్వామి మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో భార్య భవితతో ఘర్షణపడ్డాడు. ఆ తర్వాత భార్య మీద అలిగి కోపంతో అవుషాపూర్‌లోని ప్రియురాలు దీపిక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో దీపిక భర్త లేకపోవడంతో ఆ రాత్రంతా అక్కడే ఉన్నాడు. తెల్లవారేసరికి వంటగదిలో స్వామి ఉరేసుకుని కనిపించాడు. తన ప్రియుడు శవమై కనిపించడాన్ని చూసిన దీపిక.. ఆందోళన చెందుతూ ఇబ్రహీంపట్నంలో ఉన్న తన భర్త ముఖేశ్‌కు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆయన హుటాహుటిన ఇంటికి వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. 
 
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. వంట గదిలో ఉరి వేసుకున్న తీరును పరిశీలించి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తన భర్త మరణ వార్త తెలుసుకున్న భవిత కూడా ఇంటికి చేరుకుని. స్వామి ఆత్మహత్య చేసుకున్నాడని దీపిక, ముఖేశ్ చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవని, తన భర్త మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు