మధుమేహ రోగులను ఇబ్బందిపెట్టే ఎముక పగుళ్లు

శుక్రవారం, 12 జూన్ 2020 (22:34 IST)
మధుమేహ రోగులు ఇది గమనించాలి. డయాబెటిస్‌తో నివశించేవారికి ఎముక పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెపుతున్నారు. టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి వెన్నెముక మరియు నడుము భాగంలో ఎముక సంబంధించి బాధపడే అవకాశం వుందని తేలింది.
 
జూన్ 8, 2020లో డయాబెటిస్ అవగాహన కార్యక్రమంలో వెల్లడైన విషయాలు, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి కంటే టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని తేలింది. ఇన్సులిన్ వాడకం మరియు ఎవరైనా ఈ పరిస్థితితో నివశించిన సమయం టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదాన్ని మరింత పెంచినట్లు కనుగొన్నారు.
 
"డయాబెటిస్ మూత్రపిండాల సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, పాదాలతో సమస్యలు, నరాల దెబ్బతినడం వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది" అని యుకే లోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యయన ప్రధాన పరిశోధకుడు డాక్టర్ టాటియాన్ చెప్పారు. అయినప్పటికీ, డయాబెటిస్ ఉన్న చాలామందికి, వారి వైద్యులకు ఎముక పగుళ్లు వచ్చే ప్రమాదం ఉందని తెలియదు.
 
ప్రతి సంవత్సరం యూకేలో సుమారు 76,000 మంది ప్రజలు తుంటి పగులుతో బాధపడుతున్నారు. పగులు వచ్చిన సంవత్సరంలోనే 20 శాతం మంది చనిపోతారని భావిస్తున్నారు. చాలామంది ఇతరులు పూర్తిగా చైతన్యాన్ని తిరిగి పొందలేరు. కనుక మధుమేహ రోగులు వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు