కెన్యాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు.. 169కి చేరిన మృతులు

సెల్వి

మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (20:59 IST)
Kenya Floods
కెన్యాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 169కి చేరుకుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమ కెన్యా పట్టణంలోని మై మహియులో సోమవారం ఉదయం డ్యామ్ పేలడంతో 48 మంది మృతి చెందగా, అనేక మంది నిరాశ్రయులైనారని ఐజాక్ మవౌరా తెలిపారు. 
 
వర్షాల కారణంగా ఇప్పటి వరకు 169 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్లంతు అయిన వారి కోసం రెస్క్యూ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. తూర్పు ఆఫ్రికా దేశం ప్రస్తుతం ఎల్ నినో ప్రేరేపిత సగటు కంటే ఎక్కువ వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. కెన్యా వాతావరణ విభాగం భారీ వర్షాలు ఈ వారం కూడా కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో వరదలు మరియు కొండచరియలు విరిగిపడే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు