ఇండోనేషియాలో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు

గురువారం, 11 నవంబరు 2021 (10:45 IST)
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దేశంలోని తూర్పు ప్రావిన్స్ అయిన పపువా బరాత్‌లో గురువారం తెల్లవారుజామున 12.46 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు వాతావరణ సంస్థ జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. కైమానా జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని, సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని చెప్పింది.
 
ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.తరచూ భూకంపాలు సంభవించే ఇండోనేషియాలో గురువారం సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు