ఇరాన్పై అమెరికా దాడుల నేపథ్యంలో అగ్రరాజ్యాన్ని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా అగ్రరాజ్యాన్ని హెచ్చరించింది.