ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

ఐవీఆర్

శుక్రవారం, 20 జూన్ 2025 (14:22 IST)
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎనిమిదవ రోజుకి చేరుకుంది. ఇరు దేశాలు పూర్తి శక్తిసామర్థ్యాలు చూపిస్తూ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ వేసిన భారీ క్షిపణి ఒకటి ఇజ్రాయెల్ మైక్రోసాఫ్ట్ కార్యాలయం ముందు పడి భారీ విస్పోటనం సంభవించింది. అగ్నిమాపక దళం హుటాహుటిన రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే పనిలో పడ్డాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు రాత్రిపూట వరుస దాడులలో ఇరాన్ అంతటా పలు సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశాయని తెలిపాయి. ఇరాన్ శుక్రవారం ఇజ్రాయెల్‌పై కొత్త క్షిపణుల దాడిని ప్రారంభించింది. నగరంలోని సోరోకా ఆసుపత్రిపై దాడి తర్వాత వరుసగా రెండవ రోజు బీర్షెబా నగరాన్ని తాకింది.
 
ఇరానియన్ క్షిపణులు దక్షిణ ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద వైద్య కేంద్రమైన సోరోకా ఆసుపత్రిపై దాడి చేయడంతో సుమారు 240 మంది గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ దేశానికి భారీ నష్టం వాటిల్లుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇరాన్ దేశానికి తగిన బుద్ధి చెబుతామని అన్నారు.
 

ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడి.. మైక్రోసాఫ్ట్ ఆఫీసు దగ్గర భారీగా ఎగిసిపడ్డ మంటలు..

బీర్షెబాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీసు సమీపంలో ఇరాన్ క్షిపణి ఢీకొట్టడం భారీ అగ్నిప్రమాదం సంభవించింది

ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేస్తున్నాయి pic.twitter.com/i7Ud5mEVKT

— BIG TV Breaking News (@bigtvtelugu) June 20, 2025
ఇరాన్‌పై దాడి చేయాలా వద్దా అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ తెలిపింది. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా- ఇజ్రాయెల్ డిమాండ్లను చర్చలు సాధించగల గణనీయమైన అవకాశాన్ని ట్రంప్ ఇప్పటికీ చూస్తున్నారని అది చెబుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు