కాగా, ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కూడా కలిసిన విషయం తెల్సిందే. ఇరాన్ అణుస్థావరాలపై యూఎస్ దాడి చేసింది. దీంతో హర్మూజ్ జలసంధిని మూసివేత దిశగా ఇరాన్ అడుగులు వేసింది. ఇదే జరిగితే బ్యారెల్ చమురు ధర 80 డాలర్ల దాటుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. దీనివల్ల ప్రధానంగా దిగిమతులపై ఆధారపడే మన దేశానికి ద్రవ్యలోటు వచ్చింది. మరోవైపు, ఈ వార్తల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కూడా దూసుకెళుతున్నాయి.