వివరాల్లోకి వెళితే బీహార్, పాట్నాకు చెందిన ఇంద్రాణి కుమారి అనే మహిళకు, నకుల్ శర్మ అనే వ్యక్తితో 2022వ సంవత్సరం వివాహం జరిగింది. అయితే వివాహానికి అనంతరం నకుల్ శర్మ తాగుడుకు బానిస అయ్యాడు. రోజూ తప్పతాగి భార్యతో గొడవకు దిగేవాడు. ఒక దశలో భర్త నుంచి ఆమెకు వేధింపులు ఎక్కువయ్యాయి.
ఇక భర్త వేధింపులు భరించలేక ఇంద్రాణి పవన్తో జీవితాంతం వుండిపోవాలనుకుంది. అంతే ఇంటి నుంచి పారిపోయి ఇంద్ర-పవన్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంద్రకుమారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పవన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నానని.. ఇకపై నకుల్తో సంసారం చేయబోనని ఇంద్ర పోలీసులతో స్పష్టం చేసింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.