ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బబినా నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా రాజీవ్ సింగ్ పారిఛా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ రైలులో ఒక ప్రయాణికుడిపై దాడిచేసి చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ అధిష్టానం తీవ్రంగా స్పందిస్తూ ఎమ్మెల్యే షోకాజ్ నోటీసు జారీచేసింది.
ఈ వీడియో వైరల్ కావడంతో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా.. ఎమ్మెల్యే పారిఛాకు షాకాజ్ నోటీసు పంపారు. ఏడు రోజుల్లోగా విరణ ఇవ్వాలని ఆదేశించారు. మీ చర్యలు పార్టీ ప్రతిష్టలు దెబ్బతీశాయి. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యాన్ని సూచిస్తున్నాయి. ఏడు రోజుల్లోగా స్పందించాలి. లేకపోతో కఠిన చర్యలు తీసుకుంటాం అని నోటీసుల్లో పేర్కొన్నారు.