వివరాల్లోకి వెళితే.. హర్యానా, ముఖిజా కాలనీకి చెందిన 7 ఏళ్ల బాలుడు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. అయితే తాను ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేసుకుని రాలేదని పాఠశాల ప్రిన్సిపల్ మందలించాడు. అతనికి పనిష్మెంట్ ఇచ్చే దిశగా.. విద్యార్థిని తాడుతో తలకిందులుగా వేలాడదీసి.. పిల్లలతో చెంపదెబ్బలు కొట్టించాడు.
అయితే ఇదంతా తన స్నేహితులకు వీడియో కాల్ చేసి బాలుడు వివరించడంతో తల్లిదండ్రులు వెంటనే స్కూల్ కు వెళ్లి ఆరాతీయగా బాగోతం మొత్తం బయటపడింది. ఈ వ్యవహారం మొత్తం పోలీస్ స్టేషన్ కు చేరడంతో వేగంగా చర్యలు తీసుకున్నారు. పోలీసులు డ్రైవర్ అజయ్పై జువెనైల్ జస్టిస్ చట్టంలోని తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.