ఆయన ఆరేళ్ల క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయం కాకపోవడంతో బి.అగ్రహారంలోని ముత్తుమారియమ్మన్ ఆలయానికి వెళ్లి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాడు. తన ఆరోగ్యం కుదుటపడేలా చేయాలని ప్రత్యేక పూజలు చేశాడు. మంగళవారం 151 మేకలతో ముత్తుమారియమ్మన్ ఆలయానికి వచ్చిన ఆయన... మేకలను బలిచ్చి మొక్కు తీర్చుకుని, అమ్మవారిని దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ మేకలతో ఆలయానికి వచ్చిన భక్తులకు విందు భోజనం వడ్డించాడు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.