సీబీఎస్ఈ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు - వచ్చే యేడాది రెండుసార్లు..

ఠాగూర్

బుధవారం, 25 జూన్ 2025 (17:53 IST)
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పబ్లిక్ పరీక్షా విధానంలో కీలక మార్పులు చేసింది. వచ్చే యేడాది నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలను రెండుసార్లు నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇదే విషయంపై సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సంజయ్ భరద్వాజ్ మాట్లాడుతూ, ఈ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా తొలి దశ పరీక్షలు ఫిబ్రవరిలోనూ, రెండో దశ పరీక్షలు మే నెలలో జరుగుతాయని తెలిపారు. తొలి ఫలితాలు, ఏప్రిల్, రెండో దశ ఫలితాలు జూన్ నెలలో విడుదల చేస్తామని తెలిపారు. అయితే, తొలి దశ పరీక్షలకు విద్యార్థులు విధిగా హాజరుకావాలని, రెండో దశ పరీక్షలు మాత్రం ఐచ్ఛికం అని తెలిపారు. 
 
తమ పెర్ఫారమెన్స్ పెంచుకోవాలని ఆశించే విద్యార్థులు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మాత్రం అకడమిక్ సెషన్‌లోనే ఒకేసారి ఉంటుందని పేర్కొన్నారు. రెండో దశలో విద్యార్థులు సైన్స్, గణితం, సోషల్ సైన్స్, లాంగ్వేజ్‌లలో మూడు సబ్జెక్టులను ఎంచుకుని బెటర్‌మెంట్ కోసం రాసుకోవచ్చని ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు