ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొని ఎన్డీయే కూటమి తరపున బీజేపీకి ప్రచారం చేశారు. ఫలితంగా షహదరాలో బీజేపీ అభ్యర్థి 32 యేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక్కడ 1993లో తొలిసారి బీజేపీ అభ్యర్థి రామ్ నివాస్ గోయల్ గెలుపొందారు. ఆ తర్వాత 1998, 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2013లో శిరోమణి అకాలీదళ్, 2015, 2020లో ఆప్ అభ్యర్థులు గెలుపొందారు.