భార్యను చంపి.. శవం పక్కనే రాత్రంతా నిద్రపోయిన భర్త... ఎక్కడ?

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (09:52 IST)
తాగిన మైకంలో భార్యను చంపేశాడు. అదీకూడా అత్తారింట్లోనే. మద్యంమత్తులో భార్యతో గొడవపడి ఆమెను హత్య చేశాడు. ఆ మత్తులోనే శవం పక్కనే రాత్రంతా పడుకున్నాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ్‌కుమార్ (32) అనే వ్యక్తి బురారీలోని సంత్ నగర్‌లో ఉంటున్నాడు. గతంలో కోట్లాలోని ముబారక్‌పూర్‌లో కుమార్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. అయితే, లాక్డౌన్ తర్వాత పనిలేకపోవడంతో అత్తారింటికి వెళ్లిపోయాడు. ఆరు నెలల పాటు భార్య, కొడుకుతో అక్కడే ఉన్నాడు. 
 
భార్య చిన్న కిరాణా షాపు నపుడుతుంటే... అతను ప్లంబర్‌గా పనిచేయసాగాడు. అయితే, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో డిన్నర్ పూర్తి అయింది. ఓ అరగంట తర్వాత ఫుల్లుగా తాగాడని కుమార్‌తో గొడవపెట్టుకుంది.
 
ఆ గొడవలోనే హశికను గొంతు నొక్కి చంపేశాడు. తర్వాత శవం పక్కనే పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుజామున 4గంటల 30నిమిషాలకు లేచి చూసేసరికి భార్య కదలకుండా పడి ఉంది. అంతే బ్యాగు సర్దుకుని నాంగ్లోయ్‌లోని సోదరి ఇంటికి పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు