ఈ క్రమంలో దినేశ్భాయ్ (50), సునీల్ (21) అనే ఇద్దరు వ్యక్తులు వెళ్తున్న బైక్ను బలంగా ఢీకొట్టి.. బైకును అలానే ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన 33 సెకన్ల వీడియోలో, కారు కింద బైక్ చిక్కుకుని ఉండటం, ఓ వ్యక్తి కిందపడిపోవడం స్పష్టంగా కనిపించింది.
 
									
				
	 
	సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కారు నడిపిన టీచర్ మనీశ్ పటేల్ను, అతడి సోదరుడు మెహుల్ పటేల్ను అరెస్ట్ చేశారు. వారి కారు నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు. బాధితులను చికిత్స నిమిత్తం లూనావాడ, గోధ్రా సివిల్ ఆసుపత్రులకు తరలించారు.
 
									
				
	డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలని, విద్యా శాఖకు శాఖాపరమైన విచారణను సిఫార్సు చేయడంతో సహా పోలీసులు కఠినమైన చర్యలు ప్రారంభించారు. మద్యం సేవించి ప్రాణాలకు ముప్పు కలిగించినందుకు నిందితులు ఇద్దరూ పూర్తి చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటారని డివైఎస్పి వాసవా తెలిపారు.