కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

ఠాగూర్

శనివారం, 28 జూన్ 2025 (12:27 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో సెక్యూరిటీ గార్డును అరెస్టు చేశారు. బాధితురాలు చదువుతున్న సౌత్ కోల్‌కతా లా కాలేజీకి చెందిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో ఈ కేసులో పట్టుబడిన నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది. 
 
వివరాల్లోకి వెళితే... సౌత్ కోల్‌ఖతా లా కాలేజీలో తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై ఇటీవల కాలేజీ ప్రాంగణంలో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు అధికార టీఎంసీకి చెందిన స్థానిక నేతగా గుర్తించారు.
 
తాజాగా ఈ కేసులో సెక్యూరిటీ గార్డు పాత్ర కూడా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు నిందితుడుని అరెస్టు చేశారు. విద్యార్థులకు రక్షణగా ఉండగాల్సిన గార్డే ఈ దారుణంలో పాలుపంచుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కళాశాల ఆవరణలోనే ఈ దారుణం జరగడం గమనార్హం. అందులో రాజకీయ నాయకుడుతో పాటు కాలేజీ సిబ్బంది ప్రమేయం కూడా ఉండటంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో నగరంలో మరోమారు మహిళల భద్రపై చర్చ మొదలైంది. కేసులో ఇంకెంతమంది పాత్ర ఉందనే కోరణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు