17 ఏళ్ల విద్యార్థితో 26 ఏళ్ల లెక్చరర్ జంప్.. ఆపై పెళ్లి.. ఎక్కడ?

శనివారం, 26 మార్చి 2022 (15:04 IST)
వయోబేధం లేని ప్రేమకథలు.. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తమిళనాడులో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థితో ఓ లెక్చరర్ పారిపోయి వివాహం చేసుకున్న ఘటన తిరుచ్చిలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. ఇంటర్ తొలి సంవత్సం చదువుతున్న 17 ఏళ్ల  విద్యార్థి మిస్సయ్యాడు. దీంతో ఆతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. అనంతరం విచారణ జరిపిన పోలీసులకు షాకింగ్ వ్యవహారం తెలియవచ్చింది. 
 
ఇంటర్ తొలి ఏడాది విద్యార్థి.. అదే కాలేజీలో పనిచేస్తున్న 26 ఏళ్ల షర్మిల అనే లెక్చరర్‌తో పారిపోయాడని.. వాళ్లిద్దరికీ పెళ్లి కూడా అయినట్లు పోలీసులు తేల్చారు. దీంతో షర్మిల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారికి అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు