ప్రియుడు ముందే యువతిపై ఖాకీల అత్యాచారం..

ఆదివారం, 15 మార్చి 2020 (16:20 IST)
పుదుచ్చేరిలో దారుణం జరిగింది. కొండంత అండగా నిలువాల్సిన పోలీసులే సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ప్రియుడు ముందే ప్రియురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం బయటకురావడంతో ఆ ఖాకీలపై సస్పెండ్ వేటుపడింది. ఈ ఘటన పుదుచ్చేరిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రముఖ పర్యాటక ప్రాంతం పుదుచ్చేరికి ప్రతి వారాంతపు రోజుల్లో ఇక్కడికి ప్రేమజంటలు వాలుతుంటారు. అయితే శుక్రవారం రాత్రి కడలూరుకు చెందిన.. ప్రేమికుల జంటలు అక్కడికి వచ్చాయి. 
 
వారిని గమనించిన బీచ్ బీట్ పోలీసులు... ఆ ప్రేమ జంటల దగ్గరికి వాలిపోయారు. వెంటనే అక్కడ ఉన్న రెండు ప్రేమజంటల దగ్గరికి వెళ్లి.. వారు ఉన్న గదుల వద్దకు వెళ్లి తలుపుతట్టారు.మీ విషయాన్ని మీ ఇంట్లో వారికి చెబుతామని.. మీపై కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో బయపడిపోయిన ఓ జంట వారికి లంచంగా రూ.20 వేలు ఇచ్చేశారు.
 
అయితే మరో ప్రేమజంట వద్దకు వాలిన పోలీసులు.. వారిని కూడా బెదిరించసాగారు. అయితే వారి వద్ద డబ్బులు లేకపోవడంతో.. ఆ ప్రేమ జంటపై అఘాయిత్యానికి దిగారు. ప్రియుడి చూస్తుండగానే.. తన ప్రియురాలిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ విషయాన్ని బయటకి చెప్తే పరువుపోతుందని భయపడ్డారు. 
 
ఆ తర్వాత వారు అక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత పోలీసులు చేసిన ఈ దారుణం వెలుగులోకి రావడంతో.. సీనియర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారుల వీరిపై విచారణ చేపట్టింది. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. మామూళ్ల వసూళ్లు చేసిన ఘటనలు రుజువవ్వడంతో ఇద్దరు కానిస్టేబుల్లను సస్పెండ్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు