మకరవిళక్కు... తెరుచుకున్న శబరిమల ఆలయం

మంగళవారం, 16 నవంబరు 2021 (12:59 IST)
కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన శబరిమల ఆలయం.. సుధీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు తెరుచుకుంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకులు కందరారు మహేష్ సమక్షంలో మరో అర్చకుడు వీకే జయరాజ్ ఆలయ గర్భగుడి తెలుపులు తెరిచారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా భక్తుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శబరిమల ఆలయ బోర్డు తెలిపింది. 
 
శాస్త్రోక్తంగా పూజలు చేసిన తర్వాత తెరుచుకున్న శబరిమల ఆలయంలోకి ఇవాళ్టి నుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. డిసెంబర్ 26న శబరిమలలో మండల పూజ ముగుస్తుండగా.. మకరవిళుక్క పండుగ కోసం మరలా డిసెంబర్ 30న తిరిగి ఆలయం తెరుచుకోనుంది. 
 
అలాగే జనవరి 14న మకరజ్యోతి దర్శనం తర్వాత 20వ తేదీ ఆలయాన్ని మూసివేయనున్నారు. అయితే అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు పాటించాలని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు