అన్నాచెల్లెళ్ల ఆత్మహత్య.. ప్రేమించుకున్నారు.. చివరికి..?

బుధవారం, 30 మార్చి 2022 (20:41 IST)
బీహార్‌లోని బంకా జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పాటు చీవాట్లు పెట్టడంతో  అన్నాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే... బంకా జిల్లాలోని బదాసన్ గ్రామానికి చెందిన ఓ యువతి, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. వీరిద్దరు వరుసకు అన్నా చెల్లెలు అవుతారు. 
 
కానీ తమ ప్రేమకు వీరి బంధం అడ్డుకాలేదు. మనసులు కలిశాయి. పెళ్లి చేసుకొని.. కలిసి జీవించాలని అనుకున్నారు. కానీ ఆరు నెలల క్రితం వీరి ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు తెలిసింది. పెద్దలు చీవాట్లు పెట్టారు. ఇద్దరినీ కొట్టారు. 
 
కుటుంబ సభ్యులకు తెలియకుండా ఫోన్‌లో మాట్లాడుకునే వారు. ఫోనులో గంటల తరబడి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనలో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు