గబ్బిలాలను వేటాడి వాటి మాంసాన్ని చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్న ఘటన తమిళనాడులోనే సేలం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అడవుల్లో గబ్బిలాలను వేటాడే ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద జరిపిన విచారణలో వారు గబ్బిలాలను వేటాడి.. హోటళ్లకు సప్లై చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈ సమాచారంతో సేలం పోలీసులు, ఆహార భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు.