తాండవం చేస్తున్న నిరుద్యోగం.. 45 ఏళ్లలో ఈ పరిస్థితి లేదు.. ఒప్పేసుకున్న ఎన్డీయే

శనివారం, 1 జూన్ 2019 (18:04 IST)
గత 45 ఏళ్లలో లేని నిరుద్యోగం.. తాండవం చేస్తోందని.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఒప్పేసుకుంది. గత ఐదేళ్లలో మోదీ సర్కారు చేతివాటంతో నిరుద్యోగం.. మునుపెన్నడూ లేని స్థాయికి పెరిగిందని విపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి.


ఈ నేపథ్యంలో కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో నిరుద్యోగం 6.1 శాతంగా పెరిగిందని తెలియవచ్చింది. 
 
ఎన్నికలకు ముందు జనవరి మీడియా వెలువరించిన వివరాలను కొందరు మంత్రులు ఖండించారు. గత ఐదేళ్లలో మోదీ సర్కారు పాలనలో నిరుద్యోగం భారీగా పెరిగిందని విపక్షాలు కూడా విమర్శలు గుప్పించాయి. 
 
ఈ విమర్శల్లో నిజం వుందని ప్రస్తుతం విడుదలైన గణాంక వివరాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలకు తర్వాత కేంద్రం విడుదల చేసిన వివరాల్లో శివరాల్లలో 7.8 శాతం యువత నిరుద్యోగంతో వున్నారని.. గ్రామీణ ప్రాంతాల్లో 5.3 శాతం యువతకు ఉద్యోగాలు లేవని తేటతెల్లమైంది. 
 
ఆడామగా తేడా విషయానికి వస్తే.. పురుషుల్లో 6.2 శాతం, మహిళల్లో 5.7 శాతం నిరుద్యోగత వుంది. వరుసగా రెండోసారి ఎన్డీయే సర్కారు కేంద్రంలో పరిపాలనకు వచ్చినా.. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా, జీడీపీ తగ్గుముఖం పట్టింది. నిరుద్యోగం మునుపెన్నడూ లేని విధంగా తాండవం ఆడుతోంది. దీంతో ఎన్డీయే అధికారులు తలపట్టుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు