మాయా'లేడి' : పెళ్లి పేరుతో టెక్కీ వద్ద రూ.16 లక్షలు దోచుకుంది.. ఎక్కడ?

బుధవారం, 24 జూన్ 2020 (11:32 IST)
ఓ మాయలేడి ఏకంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మోసం చేసింది. పెళ్లి పేరుతో ఏకంగా రూ.16.82 లక్షలను దోచుకుకుంది. ఈ ఘటన దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరు నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగళూరుకు చెందిన అంకుర్ శర్మ అనే వ్యక్తి టెక్కీగా పని చేస్తున్నాడు. ఓ మేట్రిమోనియల్ సైట్ ద్వారా అతడికి కిరారా శర్మ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. 
 
ఈ నేపథ్యంలో అతడికి మరింత దగ్గరైన యువతి వివిధ కారణాలు చెబుతూ అంకుర్ శర్మ నుంచి ఏకంగా రూ.16.82 లక్షలు తీసుకుంది. ఆ తర్వాత క్రమంగా అతడిని దూరం పెట్టసాగింది. 
 
పైగా, ఆమె వివాహానికి ఒప్పుకోకపోవడమేకాకుండా తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు