నవరాత్రులు సందర్భంగా స్కంధమాతను ఐదవ రోజు పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో కుమార స్వామికి ప్రాధాన్యత ఇస్తారు. స్కంధమాత సింహవాహనం మీద నాలుగు చేతులతో అలరారుతూ వుంటుంది. రెండు చేతులా కమలాలను ధరించి, ఒక చేతితో అభయాన్ని అందిస్తూ.. మరో చేతితో కార్తికేయుడిని పట్టుకుని ఉండే అమ్మవారిగా ఆమె దర్శనమిస్తుంది. స్కంధమాతను పూజిస్తే.. ఇహంలో జ్ఞానం, పరంలో మోక్షం సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఆమెను పూజిస్తే కార్తీకేయుడి అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.