అనంతరం శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, అభిషేకాలు, అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు వంటివి దేవుడికి సమర్పించాలి. పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.
ఇంటికి తిరిగి వచ్చాక ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇలా బుధవారం పూట వచ్చే ప్రదోష వేళ మహాదేవుడిని పూజించడం ద్వారా నవగ్రహ దోషాలతో పాటు సమస్త ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. బుధ ప్రదోషం రోజు బ్రాహ్మణులకు, అన్నార్తులకు అన్నదానం చేయడం శ్రేష్టం. శక్తి ఉన్నవారు ఇతర దానాలు కూడా చేయవచ్చు.