Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

సెల్వి

శుక్రవారం, 27 జూన్ 2025 (13:14 IST)
Elephant
గుజరాత్‌లోని గోల్‌వాడ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపులో ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తులు భయంతో పరుగులు తీయడం కారణంగా తొక్కిసలాట జరిగింది. పలువురు భక్తులకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. 
 
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమాల్‌పూర్‌లోని జగన్నాథ ఆలయంలో మంగళ హారతి నిర్వహించిన తర్వాత 148వ రథయాత్ర ప్రారంభమైంది. గంటలు, శంఖాలు , ‘జై జగన్నాథ’ మంత్రాల మధ్య రథాలు వాటి స్థానం నుంచి కదిలిన వెంటనే, పూరీ నగర వాతావరణం అద్భుతమైన, దైవిక శక్తితో నిండిపోతుంది. ఈ చారిత్రాత్మక, ఆధ్యాత్మిక ఉత్సవాన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకున్నారు. 
 
ఈ రథయాత్ర 9 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు హరే కృష్ణ హరే రామ అని జపిస్తూ రథాలను లాగుతారు. ఈ దైవత్వానికి ఆకర్షితులై విదేశీ భక్తులు కూడా భారీ సంఖ్యలో చేరుతారు. ఈ మహా యాత్ర కోసం మూడు భారీ రథాలను సిద్ధం చేశారు.

Elephants out of control.

Ceremonial elephants that are part of the 148th Jagannath Rath Yatra in Ahmedabad went out of control for a few terrible moments before finally being brought to heel by mahouts. Nobody has been reported injured in the incident.@IndianExpress pic.twitter.com/AkugGQUB8K

— Brendan Dabhi (@BrendanDabhi) June 27, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు