శెభాష్ నీరజ్ చోప్రా... ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు...

మంగళవారం, 29 ఆగస్టు 2023 (11:11 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో బంగారు పతకం సాధించి రికార్డు సృష్టించిన భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పోటీల్లోనూ గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్రపుట్టలకెక్కాడు. దీంతో నీరజ్ చోప్రాపై ప్రశంసల వర్షం కుపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా చేసిన పనికి ఇపుడు నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. 
 
ప్రపంచ అథ్లెటిక్స్‌లో చారిత్రక వజియం తర్వాత స్టేడియంలోని అభిమానుల వద్దకు వెళ్ళిన నీరజ్.. అడిగిన వారితో ఫోటోలు దిగి, ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అనర్గళంగా హిందీ మాట్లాడుతున్న హంగేరీ దేశానికి చెందిన ఓ మహిళ.. నీరజ్‌ వద్దకు వచ్చి ఆటోగ్రాఫ్ కోరింది. దీనికి సరేనని నీరజ్ అంగీకరించాడు. 
 
అయితే, ఆమె భారత జాతీయ పతాకం ఇచ్చి సంతకం చేయమని కోరింది. కానీ, నీరాజ్ మాత్రం ఏమాత్రం ఆలోచన చేయకుండా.. త్రివర్ణ పతాకంపై ఆటోగ్రాఫ్ చేయనని తెగేసి చెప్పాడు. ఆ తర్వాత ఆమె టీ షర్టుపై సంతకం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు నీరజ్ చోప్రాపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు