నిజామాబాద్ జిల్లాలో రేబిస్తో ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. కుక్క కరిచిన విషయాన్ని దాచిపెట్టడం వల్లే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గడ్డం లక్ష్మణ అనే 10 ఏళ్ల బాలిక కుక్క కాటుకు గురైన నెల రోజుల తర్వాత రేబిస్ వ్యాధితో మరణించింది. లక్ష్మణను దాదాపు నెల రోజుల క్రితం ఒక కుక్క కరిచింది.