శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

ఠాగూర్

ఆదివారం, 25 మే 2025 (10:06 IST)
Police
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న లారీ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ వెంటనే మరణించాడు. శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో విజయ్ కుమార్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 
 
ఈ రోడ్డు ప్రమాదంలో మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలైనాయి. వారిని అత్యవసర వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పోలీసు అధికారులలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

#Hyderabad--

Constable killed, three injured in road accident on #Bangalore Highway near #Shamshabad

A tragic road #accident occurred on the Bangalore National Highway near Shamshabad when a speeding lorry rammed into a police patrol vehicle conducting routine checks.… pic.twitter.com/eiGt1fALeK

— NewsMeter (@NewsMeter_In) May 24, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు