తెలంగాణలో ఇంటర్ పరీక్షలు: పార్లమెంట్ ఎన్నికలు కోసం..

శనివారం, 9 డిశెంబరు 2023 (18:57 IST)
తెలంగాణలో ఈ ఏడాది మాత్రం ఇంటర్ పరీక్షలను కాస్త ముందుగానే నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. 2024 ఏప్రిల్‌లో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో పరీక్షల నిర్వహణకు, ఆన్సర్ షీట్ల వ్యాలుయేషన్స్‌కు ఇబ్బంది కలగకుండా వుండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇంటర్ పరీక్షలు కాగానే పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. అలానే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య జేఈఈ మెయిన్స్ పరీక్షలు కూడా ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు