హైదరాబాదులో ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య.. కారణం?

సెల్వి

గురువారం, 14 మార్చి 2024 (14:30 IST)
హైదరాబాదులో ఎంబీఏ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎంబీఐ ముగించి.. ఉన్నత పదవిని అలంకరిస్తుందనుకున్న తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడిందని తెలిసి.. మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు ఉమెన్స్ హాస్ట‌ల్‌లో విద్యార్థిని బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్ప‌డింది.  యువతి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పేరెంట్స్ ఛైతన్యపురి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు