కంట్లో స్ప్రే కొట్టి బంగారు గొలుసుతో వ్యక్తి జంప్

బుధవారం, 21 డిశెంబరు 2022 (09:15 IST)
కంట్లో స్ప్రే కొట్టి బంగారు గొలుసుతో ఓ వ్యక్తి జంప్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇంట్లో ఒంటరిగా వున్న మహిళపై స్నాచర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలో చోటుచేసుకుంది. కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 2లోని ఓం శ్రీ సాయి నిలయంపై పోర్షన్ లో వెంకట యజ్ఞ కుమార్ అనే మహిళ వుంటోంది. 
 
ఒంటరిగా వున్న ఈ మహిళపై చైన్ స్నాచర్ దాడి చేశాడు.  కంట్లో స్ప్రే కొట్టి మెడలో వున్న బంగారు గొలుసును దోచుకెళ్లాడు. సమాచారం అందుకున్న క్రైమ్ అడిషనల్ డీసీపీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంకా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు