భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

బుధవారం, 14 జూన్ 2023 (19:06 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఏకంగా 12 ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకకాలంలో ఈ సోదాలు మొదలుపెట్టారు. భువనగిరి, హైదరాబాద్ నగరంలో ఉన్న ఎమ్మెల్యేకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు చేశారు. 
 
అలాగే, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్‌లో కూడా సోదాలు చేశారు. ఈ రెండు కంపెనీలకు శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టరుగా ఉన్నారు. ఈ సోదాల్లో దాదాపు 30 బృందాలు పాల్గొన్నాయి. కంపెనీల లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపుల వివరాలను ఐటీ అధికారులు పరిశీలించారు.

కేంద్ర బలగాల భద్రత మధ్య ఈ సోదాలు చేశారు. ఈ దాడుల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది. అలాగే, అలాగే, బీఆర్ఎస్ కొత్త ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డిల నివాసాల్లో కూడా సోదాలు జరిగాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు