ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న రేవంత్ రెడ్డి

శనివారం, 4 మార్చి 2023 (14:00 IST)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో రేవంత్ రెడ్డి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 
 
రేవంత్ రెడ్డి హత్ సే హాత్ జోడో యాత్రకు వెళ్తుండగా యల్లారెడ్డిపేట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో ఉన్న నాలుగు ఎస్‌యూవీలు, రెండు మీడియా వాహనాలు ధ్వంసమయ్యాయి. 
 
ఓ వాహనం డ్రైవర్‌ అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మొదటి వాహనాన్ని అనుసరిస్తున్న కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొన్నాయి. 
 
రేవంత్ రెడ్డితో పాటు ఎస్‌యూవీలో ఉన్న ఇతర వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. ఢీకొనడంతో ఈ వాహనాల్లోని బెలూన్లు తెరుచుకోవడంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం రేవంత్ రెడ్డి మరో వాహనంలో బయలుదేరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు