తాతయ్య అయిన రేవంత్ రెడ్డి

సోమవారం, 10 ఏప్రియల్ 2023 (09:52 IST)
Revanth Reddy
మల్కాజిగిరి ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి తాతయ్య అయ్యారు. తన కుమార్తె నిమిషా రెడ్డి గతవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. రాజకీయ నాయకుడు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తన మనవడితో కలిసి ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 
 
మా మనవడి రాకతో మనందరి ఆశీర్వాదాన్ని మీతో పంచుకోవడం ఆనందంగా ఉందని, నా చిన్నారి నిమిషా గతవారం మగబిడ్డకు జన్మనిచ్చింది... అంటూ చెప్పారు.
 
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు కుటుంబ సభ్యులకు తమ అభినందనలు, శుభాకాంక్షలు పంపారు. 2015లో రేవంత్ రెడ్డి కూతురు నిమిషాకు వ్యాపారవేత్త సత్యనారాయణ రెడ్డితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు