వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:17 IST)
తెలంగాణా రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో విషాదంనెల‌కొంది. అడ‌వి జంతువుల కోసం వేట‌గాళ్లు అమ‌ర్చిన విద్యుత్ తీగ‌లు త‌గిలి ఇద్ద‌రు గిరిజ‌న వ్య‌క్తులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న ముల‌క‌ల‌ప‌ల్లి మండ‌లం మాదారం అట‌వీప్రాంతంలో మంగ‌ళ‌వారం ఉద‌యం చోటుచేసుకుంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గిరిజ‌నులు కూలీ ప‌నుల‌కు వెళ్తుండ‌గా విద్యుత్ తీగ‌ల‌పై ఓ ఇద్ద‌రు కాలు మోపారు. విద్యుత్ షాక్‌కు గురై ఆ ఇద్ద‌రు మ‌ర‌ణించారు. 
 
మృతుల‌ను మొగ‌రాల‌కుప్ప‌కు చెందిన పాయం జాన్‌బాబు (24), కూరం దుర్గారావు(35)గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు