నివేదాను పిలుపించుకున్న 'వకీల్ సాబ్'.. ఎందుకంటే...

బుధవారం, 7 అక్టోబరు 2020 (09:21 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "వకీల్ సాబ్". బాలీవుడ్ మూవీ 'పింక్'‌కు ఇది రీమేక్. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు కలిసి నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చాలా మేరకు పూర్తయింది. అయితే, కరోనా కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఇపుడు సినిమా షూటింగులకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో తిరిగి ప్రారంభమైంది. లాక్డౌన్ కారణంగా గత ఆరు నెలలుగా ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే హైదరాబాదులో మొదలైంది.
 
ప్రస్తుతం పవన్ కల్యాణ్‌లేని సన్నివేశాలను ఇతర నటీనటులపై చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న కథానాయిక నివేద థామస్ కూడా మంగళవారం నుంచి ఈ చిత్రం షూటింగులో పాల్గొంటోంది. ఈ విషయాన్ని నివేద సోషల్ మీడియాలో వెల్లడించింది. 'తిరిగి షూటింగుకి రావడం బాగుంది..' అంటూ నివేద పోస్ట్ పెట్టింది.
 
కాగా, హీరో పవన్ కల్యాణ్ కూడా త్వరలోనే ఈ చిత్రం షూట్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్ర హీరోయిన్లు అంజలి, శ్రుతి హాసన్ కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు