పారిస్ ట్రిప్ నుంచి హైదరాబాద్ వచ్చిన రామ్ చ‌ర‌ణ్

మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (11:09 IST)
Charan-upsana airport
గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇటీవలే పారిస్ ట్రిప్ తన భార్య ఉపాసన తో వెళ్లారు.  అక్కడ చరణ్ కు ఓ సొంత హౌస్ కూడా ఉందని తెలుస్తోంది. బిజినెస్ టూర్ గా వెళ్లి అక్కడ ఓ యాడ్ చేసాడని అంటున్నారు. కానీ ఇంకా అది బయటకు రాలేదు. తాజాగా హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. రెండు రోజుల్లో `గేమ్ చేంజ‌ర్‌` షూటింగ్లో పాల్గొననున్నారు. రామ్ చ‌ర‌ణ్ కు ఇది 15వ సినిమా. 
 
తమిళ  డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రంఇది. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ మూవీని నిర్మిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ అన్ కాంప్ర‌మైజ్డ్‌గా అంచ‌నాల‌కు ధీటుగా గేమ్ చేంజ‌ర్‌ను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో కియారా అద్వానీ, అంజ‌లి, సముద్ర‌ఖ‌ని, ఎస్‌.జె.సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు అంటిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు