రామ్ చరణ్ - ఉపాసన దంపతుల ఇంట దీపావళి గ్రాండ్ పార్టీ.. హాజరైన తారాలోకం...

ఆదివారం, 12 నవంబరు 2023 (16:23 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లింకారతో కలిసి తొలి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ ఇంట గ్రాండ్‌గా విందు పార్టీ ఇచ్చారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ఈ విందు పార్టీలో అనేక సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా, ఈ ఫ్యామిలీ పార్టీలో తారక్, మహేశ్ బాబులు తమతమ సతీమణులతో పాటు విక్టరీ వెంకటేశ్ హాజరయ్యారు.
 
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సినీ నటులు, దర్శకులు, సినీ నిర్మాతలు కూడా చెర్రీ దంపతులు ఇచ్చిన విందు పార్టీకి హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలను మహేశ్ బాబు సతీమణి నమ్రత తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, "ఆర్ఆర్ఆర్" చిత్రం తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "గేమ్ ఛేంజర్" చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు