హార్రర్ కామెడీ మూవీ: నాలుగోసారి దీపికాతో షారూఖ్ రొమాన్స్..?

శనివారం, 12 నవంబరు 2016 (15:43 IST)
ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలతో ఆకట్టుకున్న హిట్ పెయిర్ షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనేలు మళ్లీ నాలుగోసారి జతకట్టనున్నారు. చెన్నైఎక్స్ ప్రెస్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న రోహిత్ శెట్టి మరోసారి.. ఈ హిట్ జోడీతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చర్చల్లో ఉన్నట్లు బిటౌన్‌లో వార్తలొస్తున్నాయి.  
 
షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే కాంబోలో వచ్చే నాలుగో సినిమాను హార్రర్ కామెడీగా రూపొందించేందుకు రోహిత్ శెట్టి ప్లాన్ చేస్తున్నారు.  ఓం శాంతి ఓం క్లైమాక్స్‌లో దీపికా దెయ్యంగా కనిపిస్తోంది. అదే స్ఫూర్తితో ఈ సినిమాలో దీపికాను దెయ్యంగా చూపెట్టనున్నారని తెలిసింది. తద్వారా వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బంది పడుతున్న బాద్ షా, సౌత్ నార్త్ ఇండస్ట్రీలలో సక్సెస్ ఫార్ములాగా మారిన హార్రర్ కామెడీతో ఆకట్టుకునేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. 

వెబ్దునియా పై చదవండి