శేఖర్ కమ్ముల 'కుబేర' దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్, ఇది నేషనల్ అవార్డు గ్రహీత దర్శకుడు శేఖర్ కమ్ముల, నేషనల్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు డీఎస్పీ మొదటిసారి కలిసి చేస్తున్న చిత్రం! మరో ఎక్సయిటింగ్ విషయం ఏమిటంటే నేషనల్ అవార్డు గ్రహీత ధనుష్ ఫ్రేమ్లో ఉన్నారు! ఈ ముగ్గురూ కలిసి మాస్ డ్యాన్స్ నంబర్ ఇవ్వడం ఇదే మొదటిసారి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం 'కుబేర'. ధనుష్, నాగార్జున అక్కినేని, రష్మిక మందన్న, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం గ్రిప్పింగ్ థ్రిల్లర్గా నిలుస్తుంది. ఎపిక్ సోషల్ డ్రామా రూపొందుతోంది. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారు. 'కుబేర' జూన్ 20, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.