జపాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అసురన్

శుక్రవారం, 19 మార్చి 2021 (19:30 IST)
కొలవెరి ఫేమ్ ధనుష్ హీరోగా మాణిమరన్ దర్శకత్వంలో మంచు వారియర్, పశుపతి, కేన్ కరణాస్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా అసురన్. 2019లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. అంతేకాదు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తమిళంలో పలు చిత్రోత్సవాలతో పాటు పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. 
 
తాజాగా ఈ చిత్రం జపాన్ దేశంలోని ఒసాకా నగంలోకి జరుగుతోన్న తమిళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఉత్తమ తమిళ చిత్రం విభాగంలో పోటీ పడుతున్న ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికవుతుందా లేదా అనేది చూడాలి. ఇక 'అసురన్' సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. 
 
ఇప్పటికే తెలుగులో సీనియర్ టాప్ కథానాయకుడు వెంకటేష్.. 'నారప్ప' టైటిల్‌తో అనంతపురం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ మే 14న విడుదల కానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు